గత కొన్ని రోజులుగా చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికీ కూడా ఈ పేరు వినగానే చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా వీరందరూ తిరుచూరును పోలీస్ స్టేషన్ పరిధిలో మళ్లీ ఈ గ్యాంగ్ కలకలం రేపినట్లు తెలుస్తోంది. హైవే పక్కన ఉంటున్న కొత్తపాలెం లేఅవుట్లో ఒక ఇంటిలోకి దూరి చోరికే పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి వీడియో లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం విన్న ఆంధ్ర ప్రజలకు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.


అసలు విషయంలోకి వెళ్తే కొత్తపాలెం  లేఔట్ లో సత్యనారాయణ రెడ్డి ఇంట్లో భారీగా దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ఆ ఇంటి ఆవరణంలో ఉండేటువంటి సీసీ కెమెరాలు చాలా క్లియర్ గా రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోగా సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక గదిలో నిద్రిస్తూ ఉన్నప్పటికీ.. కిటికీ బోర్డులను తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన ఈ చెడ్డి గ్యాంగ్ బీరువాలో ఉండేటువంటి నగలు నగదుతో పరారైనట్లుగా అధికారులు తెలియజేశారు.


అంతేకాకుండా బీరువాలోని బట్టలను సైతం కిందికి పడి వేసి మరి నగలు  మాత్రమే చోరీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. బనియన్లు, డ్రాయర్లు ధరించి మరణాయుధాలతో ఇళ్లలోకి చొరబడి మరి దొంగతనాలు వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ చెడ్డి గ్యాంగ్ ఎలా ఎంట్రీ ఇస్తారనే విషయాల పైన సీసీ కెమెరా వీడియోలు కూడా చూపించారు. ఇలాంటి దొంగతనాలు చేసేది కేవలం చెడ్డి గ్యాంగ్ అన్నట్లుగా అక్కడ పోలీసులు కూడా భావిస్తున్నారు. తిరుపతి జిల్లాలో చెడ్డి గ్యాంగ్ ఎంట్రీ తో ఒక్కసారిగా అధికారుల సైతం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న ఈ దొంగల ముఠా కోసం ప్రత్యేకంగా గాలించేందుకు చర్యలు చేపడుతున్నారు అధికారులు .

మరింత సమాచారం తెలుసుకోండి: