తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి స్మిత సబర్వాల్ ఈమె 22 ఏళ్ళకి యుపిఎస్ లో నాలుగవ ర్యాంకును సాధించింది. 2000 బ్యాచ్ లో ఈమె ఐఏఎస్ అధికారిగా ఉన్నది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లో జన్మించిన స్మిత సబర్వాల్ తండ్రి కూడా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఐఏఎస్ అవ్వాలని అంశంతోనే ఈమె యుపిఎస్ నుంచి 2000 సంవత్సరంలో తన రెండవ ప్రయత్నంలో 23 ఏళ్ల వయసులో ఐఏఎస్ అధికారి అయ్యిందట.
ఇలాంటి అసాధారణమైన విజయాలతో అతి చిన్న వయసులోనే ఐఏఎస్ అధికారిగా దేశంలోనే గుర్తింపు పొందింది. స్మిత సబర్వా హైదరాబాదులో మారేడుపల్లి లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ గ్రాడ్యుయేట్ కాలేజీలో బీకాం డిగ్రీని పూర్తి చేసింది. ట్విట్టర్లో ఏకంగా నాలుగు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమె ఐఏఎస్ అధికారి అయినప్పటికీ కూడా తన రచనలతో మంచి పేరు సంపాదించుకుంది. తెలంగాణలో గత ప్రభుత్వంలో సీఎం కూడా చాలా కీలకమైన బాధ్యతలు చేపట్టిన స్మిత సబర్వాల్ మొదటి మహిళ ఐఏఎస్ గా బిరుదు పొందింది స్మిత తెలంగాణలోని వరంగల్, విశాఖపట్నం, చిత్తూరు,కరీంనగర్ తో సహా పలు ప్రాంతాలలో తన సేవలను అందించింది.