రోజు రోజుకి మందుబాబులు తాగే వారి సంఖ్య పెరుగుతూనే ఉండడమే కాకుండా వీరు చేసే హంగామా వల్ల  రోడ్లమీద  వెళ్లేవారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో సాయంత్రం అయ్యిందంటే చాలు తాగుబోతుల వీరంగం సృష్టిస్తూ ఉంటారు. చాలామంది మందు విందులతోనే నడిరోడ్డ్లపైనే పార్టీలు వంటివి చేసుకుంటూ ఉంటున్నారు. సైలెంట్ గా ఉండే వారిని సైతం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దీంతో కొన్ని ప్రాంతాలలో తాగుబోతుల వీరంగానికి ప్రజలు విసిగిపోయి కొన్ని సందర్భాలలో తిరగబడిన సందర్భాలు ఉన్నాయి.


ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. తాగుబోతుల బెడదతో విసిగిపోయిన ఒక సంఘటన మహిళలందరినీ ఏకమయ్యాల చేసింది. మళ్లీ తాగుబోతులను పరిసరాలకు రానివ్వకుండా ఒక గట్టి గుణపాటాన్ని చెప్పారు. ముంబైలోని ఒక ప్రాంతంలో కొంతమంది మహిళలు రోడ్డుకి నడిరోడ్డుకుపోయిన తాగుతున్న వారందరిని చీపుర్లతో చితకబాదారు. నిత్యం రోడ్డుపైన గుమిగూడి మద్యం సేవిస్తూ ప్రజలను ఇబ్బంది చేస్తున్న కొంత మంది తాగుబోతులను చూసి విసిగిపోయిన ఆ మహిళలు ఎవరి సహాయం లేకుండానే ఇలా తమ సమస్యను సైతం పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది.


అక్కడ ఉండే మహిళలు ఒకరినొకరు మాట్లాడుకొని రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తూ తాగుబోతులను చితక్కొట్టినట్లుగా ఈ వీడియోలో వైరల్ గా మారుతున్నది. రోడ్డుపైనే మందేస్తూ మహిళలను చిన్నారులను వేధింపులకు గురి చేస్తున్న ఇలాంటి ఆకతాయిలకు మహిళలు ఇంకెప్పుడు కూడా మద్యం సేవించి ఇలా ఇబ్బంది పెట్టకూడదని ఇలాంటి పని చేసినట్లుగా తెలియజేస్తున్నారు. తాగి ఇష్టం వచ్చినట్టుగా అరుస్తున్న కొంతమంది తాగుబోతులను కూడా చితకబాదారు ఈ మహిళలు. అయితే ఈ వీడియో చూసిన చాలామంది ప్రజలు నేతలు కూడా వీరిని ప్రశంసిస్తూ ఉన్నారు. మరి కొంతమంది మహిళలు మాత్రమే ప్రపంచాన్ని చక్కదిద్దగలరు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ వీడియోని పోలీసులకు ట్యాగ్ చేస్తూ వైరల్ గా చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: