మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొంచెం గ్యాప్ రావడంతో ఆమె అమెరికా వెకేషన్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా సోషల్ మీడియలో అక్కడ చిల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేశారు. అయితే తాజాగా మూతికి ప్లాస్టర్ వేసి ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టారు లక్ష్మి. ఇది చూసి ఫ్యాన్స్ కలవర పడటంతో అసలు ఏం జరిగిందో కూడా చెప్పుకొచ్చారు. "నేను పెట్టిన ఫొటో చూశారు కదా.. ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాను. అసలు ఏమైందంటే ముందు అందరూ మన శరీరం ఏది తీసుకోగలదో.. ఏది తీసుకోలేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి.నేను మోతాదుకి మించి రెండు సాధారణమైన ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అంతే. అంతే వెంటనే నిమిషాల్లో నా పెదవి అలెర్జీ వల్ల పగిలిపోయింది. లక్కీగా నాతో పాటు అప్పుడు నా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నారు. దీంతో వెంటనే అలర్జీని కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ ఇవ్వగలిగారు. లేకపోతే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అరచేతి మీద కూడా ఒక బంప్‌లా వచ్చేసింది. దీన్ని ఐసొలేటెడ్ డ్రగ్ ఎలర్జీ అంటారు. ఇప్పుడు ఎలర్జీ తగ్గడానికి స్టరాయిడ్స్ తీసుకున్నాను కాబట్టి అలర్జీ టెస్ట్ చేయలేకోతున్నాను." అంటూ మంచు లక్ష్మి చెప్పారు.

అలానే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. "నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మనం ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్‌కి తీసుకునే ట్యాబ్లెట్ మన బాడీకి పడకపోతే ఇలానే ఎలర్జీ వచ్చి చాలా మంది చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మీ బాడీకి ఏది పడుతుంది.. ఏది పడదు తెలుసుకునేందుకు ఎలర్జీ టెస్ట్ చేయించుకోండి. ఇక ప్రస్తుతానికి నాకు బాగానే ఉంది. కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. కానీ రెండు వారాలు మాత్రం సినిమా చూసేశా.." అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.ఈ పోస్ట్ వైరల్ కావడంతో తనకి కంటిన్యూగా కాల్స్, మెసేజ్‌లు వచ్చాయంటూ ఆమె చెప్పారు. "10 రోజుల్లో ఇప్పుడే లిప్ స్టిక్ వేసుకోగలిగాను. నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. నా ఫ్రెండ్స్, ప్రెస్ నుంచి ఒకటే గోల. నేను బాగానే ఉన్నాను.. ఇదిగో తినగలుగుతున్నాను కూడా." అంటూ మరో వీడియో క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి మంచు లక్ష్మి అమెరికా పర్యటన ఏమో కానీ ఫ్యాన్స్‌ని మాత్రం యమా టెన్షన్ పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: