ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాహేతర సంబంధాలు వినిపిస్తున్నాయి. చాలామంది ఇలాంటి వాటి వల్ల హత్యలు కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో ఒక ఘటన విని పోలీసుల షాక్ అయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే అంజలి ,తరుణ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారట. అయితే అంజలీ కి మాత్రం గతంలోని ఒక వివాహం అయ్యింది తన భర్తతో విడిపోవాలని విడాకులకు అప్లై చేసిందట. ప్రస్తుతం ఆ కేస్ అయితే నడుస్తోందట. అయితే అంజలి తరుణ్ ను ప్రేమించక ముందే చాలామందితో ఈమె ప్రేమాయణం నడిపిందట.


అంతేకాకుండా తన ప్రేయసికి తరుణ్ బావమరిది అక్షయ్ తో కూడా చాలా సంబంధాలు ఉన్నాయని.. అలాగే మరొక వ్యక్తి పవన్ తో కూడా అంజలీకి చాలా సన్నిహితంగా సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. దీంతో తరుణ్ ను దారి తప్పించాలని అటు అంజలి అనుకుందట. ఆ ప్లాన్ ప్రకారమే స్వయంగా అంజలీని రంగంలోకి దిగి మరి హత్య చేయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 17న ఈ ఉదాంతం జరిగింది. తరుణ్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో తరుణ్ తల్లితండ్రులు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయగా మొదట అతడిని ఎవరో కిడ్నాప్ చేశారనుకున్నప్పటికీ కానీ పోలీసులు విచారణ ప్రారంభించేసరికి అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.


తరుణ్ తో ప్రేమాయణం సాగించిన అంజలీని తరుణ్ బావమరిది తో కలిసి తరుణ్ హతమార్చినట్లుగా విచారణలో తేలిందట. అలాగే పవన్ హస్తం కూడా ఉందనే విచారణలో తేలిందట. అయితే తరుణ్ తో ఎక్కువగా అంజలి సన్నిహితంగా కనిపించడం తరుణ్ బావమరిదికి పవన్ కి సైతం నచ్చేది కాదట. ఇలాంటి సమయంలోనే తరుణ్ బావమరిది అజయ్ పవన్ అంజలి ముగ్గురు కలిసి తరుణ్ణి చంపాలని ప్లాన్ చేసుకున్నారు. తరుణ్ణి ఒక ఇంటికి తీసుకువెళ్లి గొంతు కోసి మరి హత్య చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. అయితే ఆ సమయంలో అంజలి కూడా అక్కడే ఉందని తెలిపారు. అయితే ఆ తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను కాలువలు అడవులలో తదితర ప్రాంతాలలో పడేశారట. ఈ విషయం బయట పెట్టడానికి పోలీసులకు సుమారుగా వారం రోజుల సమయం పట్టిందా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: