సాదరణంగా మనుషులు దేవుడు చేతిలో కీలుబొమ్మలు అని చెబుతూ ఉంటారు పెద్దలు   నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేసిన వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అని నమ్మకుండా ఉండలేరు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అంత సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటున్నా సమయంలో ఎన్నో అనూహ్యమైన ఘటనలు మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చావును కొని తెచ్చుకుంటూ ఉన్నారు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ప్రమాదాలకు గురవుతూ.. చివరికి అర్ధాంతరంగానే జీవితాన్ని చేజేతులారా ముగించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే భూమ్మీద నూకలు బాకీ ఉండాలే.. కానీ ఇక ఎలాంటి ప్రమాదం నుంచి అయినా సరే చిన్న గాయం కూడా జరగకుండా బయటపడవచ్చు అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే కొన్ని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాల సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది హెడ్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలపై నడుస్తూ ఉండడం.. కొంతమంది రైలు వస్తుంది అన్న విషయానికి గమనించకుండా పట్టాలు దాటుతూ ఉండడం కారణంగా రైలు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా రైలు తన మీద నుంచి వెళ్లిన ప్రాణాలతో బయటపడగలిగింది.


 వికారాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. నవాంత్కి రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. కానీ ఒక వైపు నుంచి రైలు దూసుకు వస్తుంది అన్న విషయాన్ని గమనించలేదు. దీంతో ఆమె పట్టాలు దాటుతుండగా ఒకసారిగా రైలు దూసుకు వచ్చింది  వెంటనే అప్రమత్తమైన  మహిళ పట్టాల మధ్యలో అలాగే పడుకుండిపోయింది. అయితే రైలు వెళ్లిన తర్వాత ఆమె పైకి లేచింది  ఈ ఘటనను అక్కడున్న వారందరూ కూడా సెల్ఫోన్లో వీడియో తీయగా.  సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే ప్రమాదకరంగా పట్టాలు దాటిన సదరు మహిళలను అందరూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: