ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎంతలా పెరిగిపోతు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని అధికారులు ఎంతలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అయితే ఇలాంటి రోడ్డు ప్రమాదాల కారణంగా ఒకరు చేసిన తప్పుకి మరొకరు బలవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఇప్పటికే ఇలా ఎంతోమంది వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే.. ఇంకోవైపు రోడ్లపై దారుణంగా గుంతలు ఏర్పడటం కారణంగా కూడా ఇలాంటి ప్రమాదాలకు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని ప్రాంతాలలో రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఓట్లు వేసిన నాయకులు అయితే కంటికి కూడా కనిపించరు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు రోడ్ల అద్వాన స్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు కొంతమంది వినూత్నమైన రీతిలో నిరసన చేపట్టడం చూస్తూ ఉంటాం.


 అయితే కర్ణాటకలో కూడా ఇటీవల ఇలాంటి ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఉడిపిలో రోడ్లు అద్వానంగా ఉన్న అధికారులు పట్టించుకోవట్లేదు. దీంతో రోడ్డుపై గుంతలు ప్రయాణికులకు మృత్యువులుగా మారిపోతున్నాయ్ అని చెప్పాలి. అయితే ఇదే విషయాన్ని తెలిపేలా కొంతమంది వ్యక్తులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. యముడు చిత్రగుప్తుడు వేషధారణలో ఏకంగా గుంతలు ఉన్న రోడ్ల వద్దకు చేరుకున్నారు. అంతేకాదు చనిపోయిన వారి ఆత్మలుగా రెడీ అయి రోడ్ ఎక్కారు. ఆత్మలకు యముడు లాంగ్ జంప్ పోటీలు నిర్వహించినట్లుగా ఇలా రోడ్లపై ఉన్న గుంతలను వద్ద ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: