ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన యువతులపైన లైంగిక దాడి కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ విషయాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మతిస్థిమితం లేని ఒక యువతి పైన లైంగిక దాడి చేసినట్లుగా తెలుస్తోంది వాటికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.


అసలు విషయంలోకి వెళ్తే కొవెలకుంట్ల అనే ప్రాంతంలో ఒక మతిస్థిమితం లేని యువతీ పైన ముగ్గురు యువకుల సైతం లైంగిక దాడి చేసినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా ఈ యువతీకి మాయమాటలు చెప్పి మరి స్థానికంగా ఒక పాడుబడ్డ భవనంలోకి తీసుకువెళ్లి ఆ యువతి పైన అత్యాచారం చేస్తూ అనంతరం ఫోటోలు వీడియోలు తీస్తూ నాన్న హంగామా చేశారట. ఈ యువతి పైన ఈ నెల 24న లైంగిక దాడి పాల్పడినట్లు అధికారులు తెలియజేశారు. అయితే అనంతరం ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడంతో  పోలీసులు వీరిపైన కేసు నమోదు చేసినట్లు సమాచారం.


ఈ వీడియోలను ఫోటోలను సైతం తమ తోటి స్నేహితులకు సైతం షేర్ చేస్తూ ఉండగా ఇవి వైరల్ గా మారడంతో ఈ విషయం ఆలస్యంగా బయటికి వచ్చిందట. దీంతో పోలీసులు వెంటనే ఈ నిందితులను  సైతం అరెస్టు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. మతిస్థిమితం లేని యువతి పైన ఇలాంటి దారుణమైన ఘటనకు పాల్పడిన వారి పైన కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో చాలా దారుణాలు ఒడిగడుతూనే ఉన్నాయి వీటి పైన కూటమి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న జరుగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: