భారతీయ హిందూ సంప్రదాయంలో పెళ్లి, వ్యాపారం, ఇలా ఏ పని మొదలు పెట్టినా విఘ్నలు కలగకుండా విజయవంతంగా జరగాలని మొదటి పూజను విగ్నేశ్వరుడికి నిర్వహిస్తాం. అయితే ఆ దేశ ప్రజలు మాత్రం అగ్ని పర్వతం బద్దలు కాకుండా తమను కాపాడమని పూజలు చేస్తున్నారు. రోజూ వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు..మన దేశంలో మాత్రమే కాదు నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, నెదర్లాండ్స్, జపాన్ వంటి అనేక దేశాల్లో వినాయకుడి విగ్రహాలు, గణపతి ఆలయాలున్నయన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ఆలయాలు అతి పురాతనమైనవి మహిమానిత్వమైనవిగా ఖ్యతిగాంచాయి. భక్తులతో పూజలను అందుకుంటున్నాడు విఘ్నాలకదిపతి వినాయకుడు. అయితే ఒక ప్రాంతలో అగ్నిపర్వతం ముఖ ద్వారం వద్ద వినాయకుడు కావాలాగా ఉన్నాడు. ఇక్కడ వినాయకుడికి పూజలు చేయకుండా కోపంతో అగ్ని పర్వతం బద్దలై తాము నశించి పోతామని అక్కడ నివసించే ప్రజల నమ్మకం. అయితే ఈ విగ్రహం మన దేశంలో కాదు..ఇండోనేషియాలో ఉంది.ముస్లిం దేశమైన ఇండోనేషియాలోని తూర్పు జావాలో 7,641 అడుగుల ఎత్తులో ఓ విగ్రహం ఉంది. ‘బ్రోమో అని పిలిచే విఘ్వేశ్వరుడి విగ్రహం సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ గణేశుడుని తమ పూర్వీకులు అగ్నిపర్వతం ముందు ప్రతిష్టించారని టెంగ్గర్ మాసిఫ్ తెగ చెబుతుంది.అవును ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమోలో 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం ఉంది. అగ్నిపర్వత విస్ఫోటనం నుంచి నిరంతరం తమని గణేశుడు రక్షిస్తున్నాడని స్థానిక ప్రజల నమ్మకం. తాజా రికార్డుల ప్రకారం ఇండోనేషియాలోని 141 అగ్నిపర్వతాలున్నాయి. వాటిల్లో 130 అగ్ని పర్వతాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. ఇలా చురుకుగా ఉన్న అగ్ని పర్వతాల్లో ఒకటి మౌంట్ బ్రోమో. ఇది తూర్పు జావా ప్రావిన్స్‌లోని బ్రోమో టెంగర్ సెమెరు జాతీయ ఉద్యానవనంలో ఉంది.

ఇండోనేషియాకి చెందిన క్రియాశీల అగ్నిపర్వతం మౌంట్ బ్రోమోపై గణపతి విగ్రహం ఉంది. అక్కడ స్థానికుల చెప్పిన ప్రకారం ఈ విగ్రహం 700 సంవత్సరాలుగా అక్కడ ఉంది.అయితే ‘బ్రోమో’ అనే పదం హిందూ దేవతలలో సృష్టి కర్త అయిన బ్రహ్మకి చెందిన పేరు జావానీస్ ఉచ్చారణ నుండి ఉద్భవించింది. 2012 వరకు ఉన్న రికార్డుల ప్రకారం ఇండోనేషియా మొత్తం ప్రాంతంలో వందకు పైగా చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. దీంతో దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మౌంట్ బ్రోమో అగ్నిపర్వతంపై కనిపించే గణేశ విగ్రహానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది.ఈ చురుకైన అగ్నిపర్వతం బద్దలు కాకుండా గణేశుడు తమను రక్షిస్తాడని స్థానికులు నమ్ముతారు. టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన ఇతిహాసాల ప్రకారం సుమారు 700 సంవత్సరాల క్రితం టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన పూర్వీకులు ఈ పర్వతం మీద గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారని దృఢంగా నమ్ముతారు. దీని కారణంగా వీరు వినాయకుడికి పూజలు చేసి అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గణపతి పూజ ఎటువంటి సందర్భంలోనూ ఆపకూడదు అనేది వీరి నమ్మకం. పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఇక్కడ వినాయకుడిని పూజించడమే కాకుండా పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలా చేయకుంటే అగ్నిపర్వతం బద్దలై తమని అగ్ని పర్వతం తినేస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం.
బ్రోమో అనే పేరుకు జావానీస్ భాషలో బ్రహ్మ అని అర్థం. ఇండోనేషియా ఇస్లామిక్ దేశంగా ఉన్నప్పటికీ అక్కడ గణేషుడిపై ఎంతో భక్తి .. అంటే నమ్మకం కూడా. అందుకనే ఇండోనేషియా 20 వేల నోట్లపై వినాయకుడి బొమ్మను ముద్రించారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: