ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ఇక జనావాసాలు మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి అని చెప్పాలి. ఇక ఎంతోమంది ఈ వరదలు కారణంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రహదారులు కూడా వరద నీటితో నిండిపోవడంతో ఇక రాకపోకలు కూడా నిలిచిపోయాయి.


 ఇలాంటి సమయంలో ఎంతోమంది తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది మాత్రం వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పటికీ ఏకంగా వరద నీటిలో నుంచి వెళ్లాలని ప్రయత్నించి చివరికి వాహనంతో సహా కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక జంట కారులో వెళుతుండగా వరద ముంచేసింది. ఈ క్రమంలోనే వారి కారు కూడా వరదల్లో కొట్టుకుపోయింది. ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు. భయంతో వణికిపోతూ గట్టిగా అరుస్తూ కాపాడమని వేడుకుంటారు.


 కానీ ఇక్కడొక జంట మాత్రం అలా చేయలేదు. ఏకంగా వరదలు చుట్టుముట్టుతున్న సమయంలో కూడా కారుపై కూర్చొని హాయిగా ముచ్చటించారు. ఈ ఘటన గుజరాత్ లోని సబర్ ఖాన్తాలో వెలుగులోకి వచ్చింది. ఇలా నది వరదలో వారి కారు చిక్కుకుపోయినప్పటికీ ఈ జంట చూపిన ధైర్యానికి ఆశ్చర్యపోక తప్పదు  వరద నీటిలో కారు పూర్తిగా మునిగిపోగా.. వాళ్ళిద్దరూ అతికష్టం మీద వాహనం పైభాగానికి చేరుకున్నారు. భయాందోళనకు గురి కాకుండా ఎక్కడో పార్క్ లో కూర్చున్నామేమో అన్నట్లుగా హాయిగా ముచ్చటించడం మొదలుపెట్టారు ఆ భార్యాభర్తలు. కాగా దాదాపు రెండు గంటల తర్వాత అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు ఆ దంపతులు ఇద్దరిని  కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి: