ఈ రోజుల్లో అయితే ఎలాంటి విలువైన వస్తువును అయినా లేదంటే నగదు నగలను దాచిపెట్టడానికి అయినా సరే ఎన్నో బ్యాంకులు సేవలు అందిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇంట్లో దాచితే అంత సేఫ్టీ కాదు అని భావించి ఎంతోమంది బ్యాంకు లాకర్లలో విలువైన వస్తువులు దాచుకోవడం చూస్తూ ఉన్నాము. అయితే పూర్వకాలంలో మాత్రం ఇలాంటివి ఉండేవి కాదు. అందుకే ఎంతోమంది ఇక విలువైన నగలను భూమిలోనే పాతి పెట్టేవారు. ఒక పాత్రలో చుట్టి ఇక వాటిని భూమిలో పాతి పెట్టడం లాంటివి చేసేవారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఆ తర్వాత కాలంలో ఆయా వ్యక్తులు చనిపోతే ఆ నగలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ పాతిపెట్టారు అన్న విషయం ఎవరికీ తెలిసేది కాదు. కానీ తర్వాత కాలంలో మాత్రం అలాంటి నగలకు సంబంధించిన లంక బిందెలు లేదంటే వివిధ రకాల వస్తువులు బయటపడటం కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇలా ఇప్పటివరకు తవ్వకాల్లో పురాతన వస్తువులు దొరికిన సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ పొలాన్ని దున్నుతున్న కూలీలకు ఇలాంటిదే జరిగింది.



 వాళ్లు ట్రాక్టర్ తో పొలాన్ని దున్నుతూ ఉండగా.. వారి ట్రాక్టర్ మధ్యలో ఏకంగా ఒక కుండ కనిపించింది. దీంతో ముందుగా కార్మికులందరూ కూడా ఆ కుండను చూసి షాక్ అయ్యారు.  ఆ తర్వాత ఏంటా అని ఆ కుండకు కట్టి ఉన్న బట్టను విప్పి చూసి.. మరింత అవాక్కయ్యారు అని చెప్పాలి. ఏకంగా కొండకు ఉన్న బట్టను విప్పి చూడగా అందులో భారీగా నగలు కనిపించాయి. అయితే ఇలా కుండను విప్పిన సమయంలో.. అక్కడే ఉన్న మరో పులి అక్కడికి రాగా.. ఇక అతనితో నగలను పంచుకునేందుకు వారు అంగీకరించలేదు. చివరికి అందులో నుంచి కొంత మొత్తంలో ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఇది ఫేక్ వీడియో అని సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా చేశారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: