రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేస్తూ అవినీతికి పాల్పడుతోన్న అధికారుల భరతం పడుతున్నారు. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు పక్కాగా స్కెచ్ వేసి లంచగొండుల ఆటలు కట్టిస్తున్నారు.ఈ క్రమంలో లంచాలకు బాగా అలవాటు పడిన భార్య బాగోతాన్ని ఓ భర్త బయటపెట్టి మంచితనం ఇంకా ఉందని నిరూపించాడు. ప్రతి రోజూ తన భార్య లంచాలు తీసుకోనిదే ఇంటికి రాదంటూ ఓ భర్త తన భార్య ఎక్కడెక్కడ డబ్బులు దాచిందో మొత్తం రికార్డు చేసి మరీ బయటకు వదిలాడు. మణికొండలోని కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటూ భారీగా లంచాలు తీసుకువస్తుందంటూ భర్త ఆరోపించాడు. లంచం తీసుకోవడం తప్పు అని భర్త చెప్పినా ఆ భార్య వినలేదట. అందుకే చివరికి వీడియో తీసి పోస్టు చేశాడు. ఎక్కడెక్కడ డబ్బును దాచింది, ఏ ఏ కవర్లలో డబ్బులను ఉంచింది అన్నది వీడియోలో చూపించాడు ఆ భర్త. లంచం తీసుకుంటున్న భార్యను భర్త శ్రీపాద్ పట్టించాడు. మనికొండ మున్సిపల్ డీఈఈగా దివ్యజ్యోతి పని చేస్తున్నారని, పెద్ద లంచగొండి అంటూ భర్త శ్రీపాద్ తెలిపారు. ప్రతి రోజు తన భార్య దివ్యజ్యోతి అక్రమంగా లక్షలలో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుందని వివరించారు. నువ్వు తప్పు చేస్తున్నావ్ అంటూ తాను ప్రశ్నిస్తే, తనను తిట్టేదని వీడియో భర్త తెలిపాడు.

 దివ్య జ్యోతిపై అవినీతి ఆరోపణలు ఇటీవల వచ్చాయి. ఇప్పుడు భర్త ఏకంగా సాక్ష్యాలను బయట పెట్టి ఆమెకు షాక్ ఇచ్చాడు.దాదాపు రూ.80ల‌క్ష‌ల విలువైన నోట్ల క‌ట్ట‌లు ఇంట్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దాచిపెట్టిన దృశ్యాలు వీడియోలో క‌నిపించాయి. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. దివ్యజ్యోతి అవినీతి తెలిసి అంద‌రూ షాక్ అవుతున్నారు.ఇదిలావుండగా  భార్య తన తమ్ముడికి ఇప్పటికే రూ1.1 కోట్ల లంచం డబ్బును అప్పుగా ఇచ్చిందని ఆరోపించాడు. తన పద్ధతి మార్చుకోవాలని కొన్నాళ్ల నుంచి భర్త, దివ్యను హెచ్చరించినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సాక్ష్యాలతో సహా భార్య అవినీతి బండారాన్ని సోషల్ మీడియా వేదిక బయట పెట్టాడు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వీడియోపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. ఆమె ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేయాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శ్రీపాద్ నువ్వే అలైన భారతీయుడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: