ఆంధ్రప్రదేశ్లోని  ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కువగా  అత్యాచార సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజగా దసరా పండుగ పూట కూడా పుట్టపర్తి నియోజకవర్గం సత్యసాయి జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. చిలమత్తూరు మండలంలోని నల్ల బోయనిపల్లి సమీపంలో ఉండేటువంటి ఇద్దరు మహిళలు (అత్తా కోడళ్ళు) పై అత్యాచారానికి ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ప్రజలు ఉలిక్కిపాటు గురయ్యారు.



అసలు విషయంలోకి వెళ్తే ఆ ఊరికి దూరంగా  ఒక పేపర్ మిల్లులో వాచ్మెన్ గా కుటుంబం ఉన్నదట.. అయితే ఈ కుటుంబం గడిచిన ఐదు నెలల క్రితమే అక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారట. కానీ నిన్నటి రోజున రాత్రి సమయంలో  కొంత మంది దుండగులు అక్కడ రెండు బైకుల పైన  వచ్చి కోడవలతో బెదిరించి మరి అత్త కోడళ్ళ పైన అత్యాచారానికి పాల్పడినట్లుగా అక్కడి బాధితులు సైతం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా బలవంతంగా పక్కకు ఈడ్చుకు వెళ్లి మరి ఒకరి తరువాత ఒకరి పైన ఒక్కొక్కరు ఇలా  అత్త కోడళ్ళ పైన అత్యాచారానికి ఓడిగట్టారట ఆ దుండగులు..



అయితే అత్త కోడలు ఇద్దరు కేకలు వేయడంతో ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారట. ఈ సంఘటన జరిగిన వెంటనే  పోలీసులు సైతం సమాచారం అందించడంతో వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ సంఘటన స్థలాలని పరిశీలించి.. ఇలాంటి ఘాతుకానికి పాల్పడింది ఎవరు? అక్కడికి ఎవరు వచ్చే అవకాశం ఉన్నది..తెలిసిన వారి పనేనా అనే కోణంలో పలు రకాల దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించి ఆ నిందితులను పట్టుకునే విధంగా పోలీసులను అలెర్ట్ చేస్తామంటు జిల్లా ఎస్పీ తెలియజేశారు. నిందితులు ఎలాంటి వారైనా శిక్ష విధించేలా చూస్తామంటూ బాధితులకు అండగా ఉన్నారు. అయితే బాధితులను ఆస్పత్రికి తరలించి వెంటనే వైద్య పరీక్షలు కూడా చేయిస్తున్నారట. కానీ పండుగ పూట కూడా ఇలాంటి సంఘటన జరగడం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: