గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో శ్రీ కిషోర్.. ముఖ్యంగా నుదుటిన నిలువ తిలకం మెడలో పూసల దండ జడ అల్లుకట్టుతో పాడేటువంటి శ్లోకాలు నేటిజెన్సును బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. సినిమా పాటలకు స్టెప్పులేస్తూ రీల్స్ చేస్తేనే చూస్తారని భావననీ తొలగించేలా చేసింది శ్రీ కిషోరి.. భక్తిశ్రద్ధలతో సాంప్రదాయమైన కట్టుబొట్టుతో యువతను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.



ముఖ్యంగా శ్రీవారి పాటలకు భక్తిరస కీర్తనలతో వీడియోలతో సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే తన ఇంస్టాగ్రామ్ లో సుమారుగా 26 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఫేస్బుక్లో కూడా వేలాది మంది ఫాలో అవుతూ ఉన్నారు. ముఖ్యంగా యూట్యూబ్లో కూడా లక్షన్నర మందికి పైగా ఈమె చానళ్లు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన భక్తి కీర్తనలతో వీడియోలతో అలరిస్తున్న శ్రీ కిషోర్ ఎవరో కాదు తెలుగు అమ్మాయి అయినా హైదరాబాద్ అమ్మాయి అన్నమాట.


ఈ విషయం విన్న చాలా మంది నెటిజన్ సైతం ఆశ్చర్యపోతున్నారు. భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ భక్తులను మైమరిపించేలా చేస్తున్న శ్రీ కిషోర్ హైదరాబాద్ అమ్మాయిని తెలిసి తెగ వెతికేస్తూ ఉన్నారు. యాపిల్ మ్యూజిక్ ఇతరత్రా వాటిలలో ఈమె అలరిస్తూ ఉన్నది. విష్ణు సహస్రనామాలు కాలభైరవాష్టకంతో ఈమె తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్నది. తన కట్టు బొట్టుతో నామం పెట్టుకొని మరి పాటలు పాడుతూ ఉండడం చేత ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఈ అమ్మాయి పాడుతున్న పాటలకు మైమరిపించిపోయి భక్తులు కూడా ఈమె భక్తి పరవశంలో లీలమయ్యేలా కనిపిస్తున్నారు. మొత్తానికి తెలుగు అమ్మాయిగా పేరు సంపాదించిన శ్రీ కిషోరి తన పాటలతో అందరిని ఆకర్షించి భక్తి వైపు తిప్పేలా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోలతో మన ముందుకు వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: