ప్రస్తుతం ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నది.. మరి ఈ న్యూస్ కావాలని చేస్తున్నారు వాస్తవమో తెలియదు కానీ.. కొన్ని రోజులపాటు ఇంటర్నెట్ అనేది ఆగిపోతుందనేది వైరల్ గా మారుతున్నది.. నిజానికి ఇంటర్నెట్ అనేది ఆగిపోతే సాఫ్ట్వేర్ బిజినెస్ మొత్తం కూడా పడిపోతుంది. ప్రస్తుతం ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా మొత్తం ఈ విషయాన్ని పోస్ట్ చేస్తోంది ఇంటర్నెట్ మొత్తం ఆగిపోబోతోంది.. అందుకే కొద్దిరోజుల పాటు సోషల్ మీడియా పోస్టులకు యూట్యూబ్ వంటి వాటికి దూరంగా ఉండండి అంటూ పలు రకాల పోస్టులు వైరల్ గా మారుతున్నాయి.


అయితే ఇంటర్నెట్ వాడకం అనేది తగ్గించేందుకు ఇలా చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది ఇంటర్నెట్ కి అడిక్ట్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదురవుతున్నారని ఇలాంటి పనులు చేయబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది టెక్నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. ఒకచోట ఏదైనా ప్రాబ్లం వస్తే మరొకచోట సెట్ రైట్ చేసేలా చూస్తారు కానీ.. ఆపేందుకు సిద్ధంగా ఉండరట. ఒకవేళ ఇంటర్నెట్ ఆగిపోతే అంతర్జాతీయ కంపెనీలు లక్షల లక్షల కోట్ల రూపాయల లావాదేవుల సైతం ఆగిపోతాయి.


ఈ లావాదేవీలన్నీ కూడా కేవలం ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నాయి.. ఆ ఇంటర్నెట్ ఆధారంగానే ప్రపంచానికి సంబంధించిన కీలకమైన అడుగులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు లేదా వరదలు అప్పుడు మాత్రమే ఇంటర్నెట్ ఆగిపోవడం జరుగుతుంది.. తీవ్ర వాదుల బెదిరింపులు జరిగినప్పుడు ప్రభుత్వాలు మాత్రమే ఆపినప్పుడు మాత్రమే ఇలాంటివి ఇంటర్నెట్ బందు అనేవి ఆగిపోతూ ఉంటుంది.. మరి ఇదైతే ఇప్పుడు విచిత్రమైనటువంటి ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు.. ఒకవేళ అందరూ అనుకుంటున్నట్టుగానే ఇంటర్నెట్ అనేది ఆగిపోతే పరిస్థితి ఏంటా అంటూ మరికొంతమంది యూజర్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ఇది సరైన పద్ధతే అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: