అప్పుడే వేస‌వ కాలం మొదలైపోయింది .. ఎండలు దంచి కొడుతున్నాయి .. అయితే ఇప్పుడు ఈ వేసవికాలం పాత రికార్డులను తిరగరాసే అవకాశం ఉంద ఐఎండీ  అంచనా వేస్తుంది .. మన తెలుగు రాష్ట్రాల్లో మార్చ్ 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు .. ఇప్పటికే తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి .. ఈ ఫిబ్రవరిలోనే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు .. ఇక దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటలు దాటకముందే ఎండ ప్రభావం మొదలైపోతుంది .. గత వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూనే వస్తున్నాయి .. ముఖ్యంగా మహబూబ్నగర్ , ఆదిలాబాద్ , రామగుండం , ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే మూడు డిగ్రీలు పెరిగాయి.. అలాగే గాలిలో తేమశాతం బాగా తక్కువగా ఉంటుంది.


ఈ ఫిబ్రవరిలోనే  ఇలా ఎండలు మండిపోతుంటే .. ఇక మే నెల వచ్చేసరికి పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చు అన్న ఆందోళన కూడా ఉంది . ఇక ఈ సంవత్సరం జనవరిలో పగలు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయాయి .. ఇక ఫిబ్రవరిలో గడిచిన 13 రోజుల్లో అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవ్వగా.. ఈ 13 రోజుల్లో 11 రోజులు దేశం లోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు తెలంగాణలోనే నమోదయ్యాయి .. ఈ క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అని వాతావరణ శాఖ సూచిస్తుంది.

తెలంగాణలోని  మహబూబ్ నగర్, భద్రాచలం, ఖమ్మం, హనుమకొండ, హైదరాబాద్  జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
:మహబూబ్ నగర్.. 37.5
:భద్రాచలం..36.8
:ఖమ్మం..36.6
:మెదక్..35.6
:హైదరాబాద్..35.2
:హనుమకొండ.. 35
:ఆదిలాబాద్..34
:రామగుండం. 33.8
:నిజామాబాద్..33.5
:నల్లగొండ.. 33.2 డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

శనివారం అన‌గా ఈ రోజు గరిష్టంగా మహబూబ్ నగర్ లో 36.7, .. కనిష్టంగా నల్గొండలో 32 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి . రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఎండలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది .. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల సెంటీగ్రేట్ల ఎక్కువగా నమోదయ్యే  అవకాశం ఉందని అంచనా వేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sun