
అయితే కౌరవులు మొత్తం 100 మంది సోదరులు ఉన్నారు. వీరితో పాటు ఒక సోదరి కూడా ఉన్నది.. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. వీరు కూడా ఇతని మాటను తండ్రి మాటగా భావిస్తూ ఉంటారు. కౌరవులు మొత్తం కూడా పాండవులను ఎన్నోసార్లు ద్వేషిస్తూ అవమానిస్తూ ఉంటారు. ఇక పాండవులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కలలో మంచి ప్రావీణ్యం కలవారు. అందుకే గురువు దగ్గర ప్రశంసలు అందుకునేవారు. దుర్యోధనుడు అతని తమ్ముళ్లకు పాండవులు అంటే అసలు ఇష్టం ఉండదు. వారి నాశనం కోసమే ఎన్నో కుట్రలు సైతం పన్నుతూ ఉంటారు.. తన మామయ్య శకునితో కలిసి ఎన్నో విధాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అలా దుర్యోధనుడు పాండవులను ప్రశంసించడానికి పిలిపించి జూదంతో పాచికల నైపుణ్యం కలిగినటువంటి శకుని ద్వారా వారిని ఓడించి మరి అవమానపలిచేలా ప్లాన్ చేశారు పాండవులు.. జూదంలో తమ ఆస్తులను ధర్మాలను కోల్పోవడమే కాకుండా చివరికి పాండవుల భార్య ఆయన ద్రౌపదిని కూడా ఈ జూదంలో దుర్యోధనుడు ఓడిస్తారు. అలా బందీగా ఉన్న ద్రౌపది కౌరవులు ఎగతాళి చేసి ఆమెను అవమానపరిచి ద్రౌపది వస్త్రభరణం చేయాలని ఆదేశిస్తారు. అయితే ఈ విషయం విన్న కౌరవులలో ఒకరైన వికర్ణుడు భయంతో వద్దు సోదర అని చెప్పి ద్రౌపతిని ఎగతాళి చేయకూడదు అంటూ వ్యతిరేకించారట.. కానీ నిండు సభలో ద్రౌపదిని ద్రోణుడు, భీష్ముడు ,కర్ణుడు వంటి వారు ఉన్నా కూడా ఆపలేకపోయారు.. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు తన విషయాన్ని వెనక్కి తీసుకోకుండా ఉంటారు. అప్పటి నుంచి వికర్ణుడిని తమ సోదరుడిగా భావించే వారట..
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చివరికి మహాభారత యుద్ధం మొదలవుతుంది.. అయితే యుద్ధ సమయంలో వికర్ణుడు కౌరవుల పక్షాన పోరాడవలసి ఉంటుంది.. కౌరవులందరినీ కూడా భీష్ముడు వధిస్తానంటూ ప్రతిజ్ఞ చేసినందుకు చివరికి వికర్ణుడిని కూడా యుద్ధంలో చంపేస్తారు.. దీనికి పాండవులు కూడా చాలా బాధపడతారట.. ఈ విషయం మహాభారతంలో పాండవులందరి చేత కంటతడి పెట్టించిందట.