ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరొకసారి బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఎనిమిది ప్రాంతాలలో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతోందంటూ ఆరోగ్య సంస్థలు తెలియజేస్తున్నాయి..ఇంట్లో పెంచుకొనే కోళ్లలో కూడా ఈ వ్యాధి సోకుతున్నట్లుగా తెలియజేశారు. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని కానూరు ప్రాంతంలో బర్డ్ ఫ్లూ కోళ్లకు వచ్చిందని నిర్ధారణ కావడంతో అక్కడ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారట. ఈ క్రమంలోనే అధికారులు హెచ్చరిక చేయడంతో ఆయా ప్రాంతాలలో చికెన్ రేట్ ను కూడా చాలా దారుణంగా పడిపోయిన పరిస్థితి ఏర్పడింది.



దీంతో కోళ్ల ఫారం నడుపుతున్న వ్యాపారస్తులకు కూడా భారీగా నష్టం వాటిల్లుతోందట. ఇదంతా ఇలా ఉండగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఒక సర్వేలో కూడా పలు కీలకమైన విషయాలు తెలియజేశారు.. ఆంధ్రప్రదేశ్లో 8 ప్రాంతాలలో ఇప్పుడు ఎక్కువగా బర్డ్ ఫ్లూ విస్తరిస్తోందంటు అధికారులు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కోళ్ల ఫారంలో ఉండే కోళ్ళకే కాకుండా ఇంట్లో పెంచుకొనే కోళ్లకు సైతం ఈ వైరస్ సోకుతోందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పు రాష్ట్ర ప్రాంతాలలో ఎక్కువగా H5N1 అధికంగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు.


ఈ బర్డ్ ఫ్లూ తో ఏకంగా ఆరు లక్షల కోళ్లకు పైగా మరణించినట్లు తెలియజేశారు. ఇటీవలే రీసెంట్ గా కూడా అటు కృష్ణ ,ఎన్టీఆర్, ఉభయగోదావరి జిల్లాలలో కూడా ఈ కేసులు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయని తెలియజేశారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల చాలా కోళ్లు మరణించాయని అధికారులు తెలియజేస్తున్నారు.. మళ్లీ ఇలాంటి సమయంలో తిరిగి బర్డ్ ఫ్లూ వైరస్ వేగవంతంగా వ్యాపిస్తోందని తెలిసి అటు ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ఈ బర్డ్స్ లు విషయం పైన అటు రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. దీంతో మళ్లీ చికెన్ తినడం ప్రజలు తగ్గిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: