
దీంతో సోషల్ మీడియాలో నెగిటివిటీ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇ సమయంలో అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్ సుమా, రమ్య తో పాటూ అలేఖ్య కూడా స్పందించి క్షమాపణలు చెప్పారు. అయినా సరే ట్రోల్స్, మీమ్స్ ఆగకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది అలేఖ్య. అలేఖ్య బ్రీతింగ్ కూడా తీసుకోలేకపోతోంది. కృత్రిమ ఆక్సిజన్ ఆమెకు అందిస్తున్నారని.. అలేఖ్య అక్క సుమ.
మూడు నెలల క్రితమే మా నాన్న చనిపోయారు. మరో చావును మా ఇంట్లో మేము చూడదలుచుకోలేదు. ఇక మాకు ఈ పచ్చళ్ల బిజినెస్ వద్దు..యూట్యూబ్ వద్దు..ఏం వద్దు.. నా చెల్లి అలేఖ్య ఆరోగ్యంగా తిరిగి వస్తే చాలని కోరుకుంటున్నాను"అంటూ సుమ కన్నీటి పర్యంతమయ్యింది. ఇక సుమ షేర్ చేసిన ఈ వీడియో కూడా అందరిని కదిలించిందని చెప్పవచ్చు. కనీసం ఇకనైనా ఈ విషయాన్ని ఇంతటితో ఆపాలని లేకపోతే అమ్మాయి ప్రాణానికి ఏదైనా ముప్పు కలిగితే అది సోషల్ మీడియాదే బాధ్యత అవుతుందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంతటితో పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.