ఆడవాళ్లు వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కాస్త అటు ఇటు అయినా ఆ వంట రుచే మారిపోతుంది. ఉప్పు ఎక్కువయినా, తక్కువయినా గాని రుచి తేడా వస్తుంది. కానీ, ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎలాంటి టెన్షన్ ఉండదు.. ఎప్పుడయినా వండిన కూరలో ఉప్పు కాస్త ఎక్కువైంది అనుకోండి అందులో కాస్త బియ్యం పిండి కలిపితే సరిపోతుంది  వెండి వస్తువులు మెరుస్తూ ఉంటేనే బాగుంటుంది, కాస్త నల్లబడినా కూడా అవి ఉపయోగించడానికి ఇష్టపడం. ఇలాంటి సమయంలో వెండి వస్తువుల్ని టూత్ పేస్ట్ తో శుభ్రపరిస్తే కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి.


అలాగేచపాతీలు మెత్తగా ఎన్ని గంటలైన మృదువుగా రుచికరంగా ఉండాలంటే చపాతి పిండి లో కొద్దిగా గోరు వెచ్చని పాలు పోసి పిండి కలిపితే చపాతీలు మెత్తగా మృదువుగా ఉంటాయి. అలాగే తింటున్నప్పుడు ఎంతో కమ్మగా ఉంంటుంది. అలాగే పిల్లలకి పాలు ఇవ్వడం ద్వార మంచి పోషక విలువలు శరీరానికి అందుతాయి. ఎప్పుడైనా పిండి కలిపినా వెంటనే చపాతీలు చెయ్యకూడదు. ఎందుకంటే, అప్పుడు చేస్తే చపాతీలు గట్టిగా వస్తాయి. అందుకే 30 నిమిషాలు పిండిని నానాబెట్టి చపాతీలను చేసుకోవాలి. చపాతీలు కాల్చేటప్పుడు కూడా ముందుగ పిండిలో కొద్దిగా పంచదార వేసి కలిపితే గుల్లగా వస్తాయి.



చపాతీలు కాల్చిన తరువాత హాట్ ప్యాక్ లో వెంటనే పెట్టకూడదు.ఇలాగ పెడితే ఆవిరి వచ్చి తడిగా చపాతీలు అవుతాయి. అందుకే ఒక 10 నిమిషాల తరువాత హాట్ ప్యాక్ లో పెట్టాలి. అన్నం వండేటప్పుడు అన్నం పొడిపొడిగా ఉండాలంటే అందులో కొంచెం నూనె వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది. అల్లం చాయ్ అంటే అందరు ఇష్టపడతారు, మరి అల్లం రోజు దంచి వేయకుండా ఈ చిన్న టిప్ పాటిస్తే చాలు.. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటపుడు అల్లాన్ని బాగా శుభ్రం చేసి అప్పుడు పొట్టు తీస్తాం కదా.. దాన్ని పడేయకుండా కాసేపు ఎండలో పెట్టి ఆరిన తర్వాత ఒక డబ్బా లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎపుడు కావాలంటే అప్పుడు చాయి లో వేస్కొవచ్చు.













మరింత సమాచారం తెలుసుకోండి: