గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఫుడ్ మీదే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే గర్భంతో ఉన్నపుడు మహిళలు తినకూడని పండ్లు కొన్ని ఉంటాయి. అవి ఏంటో చూద్దామా.

గర్భిణులు ఫ్రూట్ పైనాపిల్ ని అసలు తినకూడదు. ఇందులో ఉండే బ్రొమలైన్ అనే పదార్థం గర్భాన్ని కొంచెం కొంచెంగా దూరం చేస్తుంది. ఈ పండు గర్భంతో ఉన్నపుడు తినడం వలన గర్భం పోవడం లేదా పుట్టబోయే బిడ్డ అనారోగ్యంగా పుట్టడం జరుగుతుంది. అందుకే ఈ పండును అస్సలు తినకూడదు.

లోంగన్ ఫ్రూట్ గురించి చాలా తక్కువగా విని ఉంటారు. కానీ గర్భంతో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ తినడం వలన ప్రెగ్నన్సీతో ఉన్న మహిళకు పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉంటుంది. ఇది తినడం వలన శరీరంలో వేడిని కలిగిస్తుంది. దీని కారణంగా గర్భంలో బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలలో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.

ప్రెగ్నన్సీతో ఉన్నపుడు బొప్పాయిని తినకూడదని అందరు చెబుతుంటారు. అయితే బొప్పాయి తినడం వలన ఏమీ కాదని, ఆరోగ్యానికి మంచిదేనని మరికొందరు అంటుంటారు. కానీ, ఇందులో ఉండే లేటెక్స్ అనే పదార్థం గర్భంలో సంకోచాలు కలిగించి గర్భవిచ్ఛిన్నం కావడానికి కారణమవుతుంది.

ఇక నల్ల ద్రాక్షను గర్భం సమయంలో తినడం మంచిదా? కాదా? అని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి నల్లద్రాక్ష తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో శరీరానికి వేడి కలిగించే గుణం ఎక్కువ. రక్తాన్ని కలిగిస్తుంది అనేది నిజమే కానీ శరీర వేడి కారణంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే వద్దని చెబుతారు.

మాములుగా ఉన్నప్పుడు లిచీ ఫ్రూట్ తినడం ఆరోగ్యకరమే. కానీ గర్భంతో ఉన్నప్పుడు తినడం వలన మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి డయాబెటిస్ కు కారణమవుతుంది. అలాగే లోంగన్ ఫ్రూట్ లాగే శరీరంలో వేడిని పుట్టించి బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: