ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేయడం చాలా సర్వసాధారణంగా సినీ పరిశ్రమలో జరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అను ఇమాన్యుయల్ హీరోయిన్గా వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కథ మొదటగా అల్లు అర్జున్ దగ్గరకు కాకుండా మరొక హీరో దగ్గరకు వెళ్లిందట. కానీ ఆ హీరో ఆ కథ ను రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్సినిమా చేశాడట.

అసలు ఈ సినిమా స్టోరీ రిజెక్ట్ చేసిన హీరో ఎవరు..? అసలు ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో కథ రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి వక్కంతం వంశీ తన కథ తో తానే దర్శకుడిగా మారాలి అనుకున్న సమయంలో తాను జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా అతని కోసం ఒక కథను రెడీ చేసి దానిని వినిపించాడట. ఇక కథ విన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమి చెప్పకుండా కొన్ని రోజులు ఆలోచించుకొని చెబుతాను అన్నాడట. ఇక కొన్ని రోజులు అయినా కూడా ఎన్టీఆర్ దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదట.

అలాగే ఆయన ఆ సినిమా చేయడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఇవ్వలేదట. ఇక అప్పటికే ఎన్టీఆర్ కు చెప్పిన స్టోరీని విని ఉన్న అల్లు అర్జున్ కు అది అద్భుతంగా నచ్చిందట. దానితో ఆయన ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడట. ఆ కథనే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే టైటిల్ తో రూపొందినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: